వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS Oct 24,2024 05:33 pm
వరి ధాన్యం అమ్మే రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. వారితో మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.