జాతీయ స్ఫూర్తి పురస్కారానికి ప్రకృతి
ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ఎంపిక
NEWS Oct 24,2024 05:35 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్ ఎన్నికయ్యారని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ జాతీయ పురస్కారాలు ఈ నెల 27న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందుకోనున్నారు. ఈ సందర్బంగా సమస్త వ్యవస్థలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దైద వెంకన్న, అనిత, జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.