వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారానికి ఉపాధ్యాయుడు ఎంపిక
NEWS Oct 24,2024 05:36 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024 కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు బాలు నాయక్ ఎన్నికయ్యారని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తనవంతుగా సమాజసేవలో పాల్గొనడం, మొక్కలు నాటడం అన్నదానం చేయడం, రక్తదానానికి సహాయ సహకారం అందించడానికి ఆయన కృషి చేశారని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దైద వెంకన్న, అనిత తెలిపారు.