రాజలింగంని పరామర్శించిన పడిగెల
NEWS Oct 25,2024 03:48 am
సదాశివ నగర్ మండలంలోని వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కుమ్మరి రాజలింగం తల్లి వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, కుప్రియాల్ మాజీ ఉపసర్పంచ్ కలాలి సాయా గౌడ్, రాజలింగం కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియాల్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆస మహేష్, లింగం, వడ్లూరు ఎల్లారెడ్డి సీనియర్ నాయకులు దుబ్బాక నర్సారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొన్నారు