ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించవద్దు
NEWS Oct 25,2024 03:34 am
రైల్వే కోడూరు: రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించ వద్దని BKMU అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి కోరారు. రైల్వే కోడూరులో డ్వామా పిడి వెంకటరత్నంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ.. ఒత్తిళ్లకు లొంగి 10 నుండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తే ఉపాధి హామీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.