కోతుల బెడదకోసం తీగలకు కరెంటు
విద్యుత్ షాక్ తో రైతు బలి
NEWS Sep 19,2024 08:46 am
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తయ్య వ్యవసాయ పనులకోసం వెళ్లాడు. ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. అదే గ్రామానికి చెందిన గొండ సాయన్న అనే రైతు కోతుల బెడదతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విద్యుత్ మోటర్ నుండి పంట చుట్టు ఇనుప కంచెలకు విద్యుత్ తీగలు పెట్టాడు. అది తెలియని ముత్తన్న అటువైపుగా వెల్లగా విద్యుత్ తీగలకు కరెంటు రావటంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.