జైపూర్: అదుపులోకి BRS నాయకులు
NEWS Sep 19,2024 05:53 am
ఎన్నికల హామీకి కట్టుబడి రైతు రుణ మాఫీ చేయాలని గురువారం ప్రజాభవన్ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి నుంచే హైదారాబాద్ వెళ్లకుండా నాయకులు దూట రాజ శేఖర్, బడుగు రవి, బొంగోని జగన్ గౌడ్, దూట రాజ్ కుమార్, గోదారి స్వామిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.