ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు
NEWS Sep 18,2024 12:06 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమర్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులని, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా, ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.