ప్రశాంతంగా నిమజ్జన ఉత్సవాలు: ఆది
NEWS Sep 17,2024 05:08 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మానేరు తీరంలో నిమజ్జనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.