ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి నుండి పలు గ్రామాల మీదుగా గుండువాగు ప్రవహిస్తుంది. దీంతో వానాకాలం వచ్చిందంటే వాగు వెంట ఉన్న తమ పొలాలకు వెళ్లాడానికి రైతులు మినీ యుద్ధమే చేయాలి. అక్కడ వంతెన నిర్మాణానికి పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో రైతే ఇంజనీర్ గా మారి వంతెన కలను సాధ్యం చేశారు. టెక్మాల్ కు చెందిన రైతు కమ్మరి రాములు ₹ 2 లక్షలతో వాగుపై వంతెనను నిర్మించారు. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ శర్మ రాములుకు 30 వేల రూపాయలు సహాయం చేశారు.