సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
NEWS Aug 27,2024 06:22 am
పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు
భారీ సంఖ్యలో మోహరించారు. నాసన్, బెల్ భూ
నిర్వాసితుల పక్షాన 48 గంటల వంట వార్పు,
నిరసనకు సీపీఎం నేతలు పిలుపునివ్వగా పోలీసులు
విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. భూములు ఇచ్చి
ఉపాధి కోల్పోయామని పేర్కొంటూ శాంతియుత
నిరసనకు నిర్వాసితులు సిద్ధం కాగా పోలీసులు
ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు చేపట్టారు.