విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలి
NEWS Aug 27,2024 06:13 am
అనంతపురంలోని బీసీ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమ మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. విద్యార్థి తండ్రి లింగమయ్య అనుమానాలు వ్యక్తం చేయడంతో ఘటనపై పూర్తి విచారణ చేసి నివేదిక అందించాలని మంత్రి సవిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని హాస్టల్ అధికారులు చెబుతున్నారు.