కళాశాల భవనం నిర్మించాలని ఎంపీకి వినతి
NEWS Aug 26,2024 10:09 am
ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని నూతన భవనం నిర్మించాలని కోరుతూ ఆలమూరు ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ గుణ్ణం వీర్రాజు, జాయింట్ సెక్రెటరీ గారపాటి త్రిమూర్తులు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీ హరీష్ మాధుర్ను అమలాపురంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు