అమలాపురం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరణ
NEWS Aug 26,2024 09:06 am
అమలాపురం డిఎస్పీగా టీఎస్ ఆర్కే ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ ఉద్యోగులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రసాద్ తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నేరాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.