పొలాలకు పరిహారం చెల్లించాలి
NEWS Aug 26,2024 09:03 am
అయినవిల్లి మండలంలో పొట్టిలంక, కొండుకుదురు లంక ,వీరవల్లిపాలెం గ్రామాల్లో ఇటీవల వచ్చిన వరదకు పంట పొలాలన్నీ నీటమునిగాయి. అయితే భారీ నష్టం వాటెల్లిందని రైతులు తెలిపారు. నీట మునిగి నెల కావస్తున్నా నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు.