కాకినాడలో కృష్ణాష్టమి ప్రత్యేక కార్యక్రమాలు
NEWS Aug 26,2024 09:07 am
కృష్ణాష్టమి పర్వదినాన పురస్కరించుకొని ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేయగా, మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రముఖ ఇంజినీరు గట్టి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.