చికిత్స పొందుతూ ముగ్గురు మృతి
NEWS Aug 26,2024 09:01 am
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేరు వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన దొరబాబు (40), పెదపూడి మండలం కాండ్రేగులకు చెందిన శ్రీనివాస్ (47), సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన త్రిమూర్తులు (38) ముగ్గురు వివిధ కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.