తెలంగాణ విజృంభిస్తున్న విష జ్వరాలు
NEWS Aug 26,2024 06:05 am
తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.