సామర్లకోటలో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
NEWS Aug 26,2024 05:54 am
సామర్లకోటకు చెందిన 53 ఏళ్ల మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ కుమారుడి భవిష్యత్తుపై మనస్థాపం చెంది అధిక మోతాదులో మాత్రలు నింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన కృష్ణారావు చౌదరి వ్యక్తిగత కారణాలతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరినీ వేరు వేరుగా కాకినాడ జీజీహెచ్కు తరలించామని సామర్లకోట పోలీసులు తెలిపారు.