జిల్లాలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు
NEWS Aug 25,2024 02:05 pm
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పుట్టపర్తిలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాటు చేపట్టినట్టు ఎస్పీ రత్న పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో జరిగే వేడుకలకు దిశ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు వైజాగ్ నుంచి 2,500 మంది భక్తులు వచ్చారని, పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు వేడుకలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.