కాకినాడ భానుగుడికి పోటెత్తిన భక్తులు
NEWS Aug 25,2024 08:19 am
కాకినాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన భానుగుడి సెంటర్లో వేంచేసియున్న సూర్యనారాయణ మూర్తి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం, ఆదివారం, సప్తమి తిథి కావడంతో భానుసప్తమి మహా పర్వదినంగా భావించి భక్తులు తెల్లవారుజాము నుండే సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్య ఆరాధనలో భాగంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.