కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయా -లసిస్ అదనపు పడకలను ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రారంభించారు. కేసీఆర్ హయంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయగా, నిత్యం పెరుగుతున్న డయాలసిస్ బాధితుల కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను మరో 5 అదనపు పడకలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. తాజాగా డయాలసిస్ అదనపు పడకలను మంజూరు చేసిన మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.