ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
NEWS Sep 17,2026 12:42 pm
హనుమకొండ కలెక్టరేట్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ గీత తో పాటు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర, జిల్లా ప్రగతి సంబంధిత వివరాలను తెలియజేస్తూ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.