గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక - బుట్టా శివ నీలకంఠ దంపతులు
NEWS Sep 16,2026 02:42 pm
ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దంపతులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలు, రైతుల సంక్షేమం, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.