వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
NEWS Sep 15,2026 07:49 pm
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా పూజిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్షణ చట్టంపై అవగాహన కల్పించారు.ఎవరైనా వేదింపులకు గురైతే డిఎల్ఎస్ఎ లేదా ట్రిబ్యునల్ ను సంప్రదించాలని సూచించారు. వృద్ధులను గౌరవించడం సంస్కారానికి నిదర్శనం అని పేర్కొన్నారు.