నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
NEWS Sep 15,2026 07:49 pm
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగినా ఎవరి దృష్టిలో పడకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.