రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష
NEWS Sep 04,2026 09:47 am
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, సర్వే–రీ సర్వే అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కేడస్ట్రల్, నాన్ కేడస్ట్రల్ గ్రామాల భూ రికార్డులు, రెవెన్యూ–అటవీ సరిహద్దు వివాదాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.