కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
NEWS Aug 30,2026 11:16 pm
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద ఈ ఘటన జరగ్గా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి పరిహారం అందించాలని సీఎంవోను కోరారు.