మానవత్వం చాటుకున్న పోలీసులు
NEWS Aug 17,2026 11:53 pm
కొండగట్టు వై జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారంతో మల్యాల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం రాత్రి ఓ మహిళ చేతికి గాయమై అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో మల్యాల సీఐ రాజ్ కుమార్, ఎస్సై సందీప్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుండటంతో ఆలస్యం చేయకుండా తమ పోలీసు వాహనంలోనే ఆ మహిళను జగిత్యాల ప్రభుత్వసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె వివరాలు సేకరించగా.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన సంపంగి రాధ(40) గా గుర్తించారు.