రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
NEWS Aug 17,2026 11:56 pm
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం, రుణమాఫీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.50 వేలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు రైతు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.