ఏపీయూడబ్ల్యూజే సేవా కార్యక్రమాలు
NEWS Aug 17,2026 11:55 pm
చోడవరం: ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవం సందర్భంగా చోడవరం ప్రెస్ యూనియన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రగ్గులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బత్తుల రామకృష్ణతో పాటు జిల్లా జాయింట్ సెక్రెటరీ సింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు దొండ రమేష్, దొండా ఈశ్వరరావు, 6టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.