ఈ-ఆటోలపై ₹1.50 లక్షల వరకు సబ్సిడీ
NEWS Aug 16,2026 04:11 pm
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో ఈ-ఆటోపై గరిష్టంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. తొలి దశలో 18,766 ఎలక్ట్రిక్ ఆటోలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాత పెట్రోల్, డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవడంతో పాటు, పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఈ-ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే పథకం విధివిధానాలు ప్రకటించనున్నారు.