అమరావతిలో అదిరిపోయేలా కేంద్ర ఉద్యోగులకు ఇళ్ళు
NEWS Aug 07,2026 01:10 pm
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అదిరిపోయేలా అత్యాధునిక వసతులతో ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన బిడ్డర్ల కోసం ఈ నెల 12న హైదరాబాద్లో ప్రీ-బిడ్ సమావేశం జరుగుతుంది. ఉద్యోగులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఈ గృహ సముదాయాల అంచనా వ్యయం రూ.1,083 కోట్లు.