విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
NEWS Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా చౌక్ వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ అనధికారంగా ధర్నా చేస్తోందంటూ బోండా ఉమా ధ్వజమెత్తారు.