అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
NEWS Aug 06,2026 03:03 pm
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన అగ్రిగోల్డ్ బాధితులు వేలాదిమంది తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూములను వేలం వేయనుంది. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్కు 23,430 ఎకరాల ఆస్తులు ఉండగా, వాటిలో 20,450 ఎకరాలు ఏపీలో ఉన్నాయి. వీటిలో 14,304 ఎకరాలను సీఐడీ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పుడు 6,330 ఎకరాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను బాధితులకు పంపిణీ చేయనుంది.