ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ వేశారు ఏ10 సైఫ్ అహ్మద్. రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. ఈ లిక్కర్ స్కాంలో రాజ్ కెసిరెడ్డితో పాటు నగదు లావాదేవీల్లో కీలకంగా వ్యవహరించారని సైఫ్ అహ్మద్ పై ఆరోపణలున్నాయి..