తమ్మినేని భార్య వాణిశ్రీపై ఫిర్యాదు
NEWS Jul 28,2026 02:33 pm
ఒకవైపు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 4 కోట్ల స్థలాన్ని కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీపై శ్రీకాకుళం నగరంలోని బలిజేపల్లివారి వీధిలో నివాసముంటున్న భోగి సుధారాణి, ఆమె కుమారుడు సంతోష్పవన్ మణికంఠ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్థలం వివాదం సమస్యను వివరించారు.