ఏపీలో రేషన్ కార్డు దారులకు పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం మీ మార్ట్ లు ఏర్పాటుచేయనుంది. ఏపీ వ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారా 1,000 ‘మీ మార్ట్’లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు కీలక దశకు చేరాయి.