ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: కాటిపల్లి గంగారెడ్డి
NEWS Jul 28,2026 01:52 pm
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతికి నష్టం కలిగిస్తే మన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. భూమిని సంరక్షించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని, పర్యావరణాన్ని ప్రేమిస్తూ మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. "పర్యావరణాన్ని ప్రేమిద్దాం.. ప్రకృతిని సంరక్షిద్దాం" అని ఆయన సందేశం ఇచ్చారు.