కరాటే పోటీల్లో మెట్పల్లి విద్యార్థుల ప్రతిభ
NEWS Jun 07,2026 11:36 pm
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు పతకాలు సాధించగా, అండర్-10 విభాగంలో విశృతి, శ్రీ మాన్వి ప్రథమ స్థానం పొందారు. అండర్-12 విభాగంలో ఆరాధ్య, శ్రీహర్ష, శోభన్ వెండి పతకాలు గెలుచుకోగా, కిషోర్ తృతీయ స్థానం సాధించారు. విజేతలను పలువురు అభినందించారు.