మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు
NEWS Jun 04,2026 12:46 am
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ భార్య డా. సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగనను మెడిసిన్ ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో జాయిన్ చేసేందుకు అమెరికా వెళ్లారు. కూతురి అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని వారు బోస్టన్ నగరం నుంచి తిరిగి న్యూయార్క్ ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మార్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపైనే పలు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న సుచీ యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి.