జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామికి
‘గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు’ ప్రదానం
NEWS May 29,2026 11:42 am
హైదరాబాద్: ఏఐ పుస్తకాల రచయిత, ప్రముఖ జర్నలిస్టు ముద్దం నరసింహ స్వామికి ప్రతిష్టాత్మక ‘గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు’ ప్రదానం చేశారు. రవీంద్రభారతి వేదికగా జరిగిన TMBMWA 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, సమాజానికి తనవంతు సహకారం అందిస్తున్నందుకు ముద్దం నరసింహ స్వామిని వేదికపై ఘనంగా సత్కరించారు.