రామ్చరణ్ మూవీ 'పెద్ది' టికెట్ ₹ 600
NEWS May 29,2026 10:11 am
రామ్ చరణ్ మూవీ 'పెద్ది' గురువారం (జూన్ 04) థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్లు వేయనున్నారు. టికెట్ ధరల పెంపుపై కూడా జీవో తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటల ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ రూ.600 (GSTతో). 4వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో ₹100, మల్టీప్లెక్స్ల్లో ₹125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి వచ్చింది. టికెట్ పెంపుపై తెలంగాణలో ఇంకా అనుమతులు రాలేదు.