రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!
NEWS May 28,2026 10:58 pm
హైదరాబాద్: TGIIC వేలంలో ఎకరా భూమి రూ.237 కోట్లు పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం వేశారు. ఈ క్రమంలో TGIIC భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది. వేలంలో భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గత అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర ₹177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. 7 ఎకరాలకు ₹1,357.59 కోట్లు వచ్చింది.