రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి
NEWS May 22,2026 11:42 pm
పవిత్ర తుంగభద్ర తీరం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో బంగారు పల్లకి సేవ వైభవంగా జరిగింది. మృత్తికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. నమో రాఘవేంద్ర నామస్మరణతో శ్రీ మఠం ప్రాంగణం మార్మోగింది. సేవలో పాల్గొన్న భక్తులకు విశేష దర్శనం కల్పించి, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీ శేష వస్త్రాలు, మంత్రాక్షితలతో ఆశీర్వదించారు.