భారీగా గంజాయి పోలీసులు పట్టివేత
NEWS May 22,2026 03:07 pm
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఒరిస్సా నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు