మావోయిజం నిర్మూలనకు కేంద్ర డెడ్లైన్ మార్చి 31 ముగుస్తున్న నేపథ్యంలో, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు తక్షణమే లొంగిపోవాలని కోరారు. హింసా మార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని విజ్ఞప్తి చేశారు. గణపతి ఆరోగ్యం క్షీణించిందని తమకు సమాచారం ఉందని, ఆయన లొంగిపోతే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.