సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్
NEWS Mar 30,2026 10:02 am
టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ తర్వాత బ్యాట్ పట్టి సిక్స్లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026’లో మంజీర బృందం కెప్టెన్గా తీన్మార్ మల్లన్న, మూసీ రివర్ బృందం కెప్టెన్గా మధుసూదన్రెడ్డి వ్యవహరించారు. మంజీర బృందంలో మంత్రి వాకిటి శ్రీహరి, మూసీ రివర్ బృందంలో అజారుద్దీన్లు ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మంజీర టీం 6 ఓవర్లలో 66 పరుగులను వేసింది. మూసీ రివర్ టీం నిలకడగా ఆడుతూ చివరి 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో అజారుద్దీన్ బరిలోకి దిగి 2 సిక్స్లు, ఫోర్లతో జట్టును గెలిపించారు.