హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఫుట్బాల్ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఫుట్బాల్ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు.