ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా GHMC ఆధ్వర్యంలో అవసరం లేని అన్ని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేయాలని నగరవాసులకు సూచించారు.